Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి వ్యాపారులపై దాడులు చేస్తారా? చంద్రబాబు ఆగ్రహం

Webdunia
శనివారం, 21 మే 2022 (11:51 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కాదు... టంగ్ స్లిప్ కావడంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన టీడీపీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయికి ఎక్కువ మంది బానిసలవుతున్నారన్నారు. గుంటూరులో యువకులు గంజాయి మత్తులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకోవాలన్నారు. 
 
మరోవైపు, ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments