Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (18:48 IST)
రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. క్షమించాలని కోరారు. అదేసమయంలో అభిమానులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ మండిపడ్డారు. తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్‌ చేయలేరా? అని నిలదీశారు. తితిదే ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలు తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని, వారు ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. అలాగే, మృతుల కుటుంబాలకు తితిదే పాలక మండలి సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. 
 
తితిదేలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సివుందన్నారు. ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గ్యాప్ ఉందని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తితిదే ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. 
 
అంతకుముందు బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద స్థలం పరిశీలన.. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments