Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (18:48 IST)
రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. క్షమించాలని కోరారు. అదేసమయంలో అభిమానులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ మండిపడ్డారు. తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్‌ చేయలేరా? అని నిలదీశారు. తితిదే ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలు తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని, వారు ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. అలాగే, మృతుల కుటుంబాలకు తితిదే పాలక మండలి సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. 
 
తితిదేలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సివుందన్నారు. ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గ్యాప్ ఉందని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తితిదే ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. 
 
అంతకుముందు బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద స్థలం పరిశీలన.. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments