Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడిన ఉత్కంఠ : పర్యటనకు ఓకే.. విశాఖకు రానున్న చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (21:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతినిచ్చే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. 
 
కాగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకుని, తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖల వద్ద అనుమతి కోరారు. ఈ అనుమతి కోరిన మరుక్షణమే తెలంగాణ పోలీసులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్‌లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో సోమవారం చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments