Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడిన ఉత్కంఠ : పర్యటనకు ఓకే.. విశాఖకు రానున్న చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (21:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతినిచ్చే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. 
 
కాగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకుని, తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖల వద్ద అనుమతి కోరారు. ఈ అనుమతి కోరిన మరుక్షణమే తెలంగాణ పోలీసులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్‌లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో సోమవారం చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments