ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (09:22 IST)
హస్తిన పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు.. తన పరిధిలోకి రాని శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో కూడా ఆయన తన పర్యటన తొలి రోజున సమావేశమయ్యారు. రెండో రోజైన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీ - పవన్ కళ్యాణ్‌‍ల సమావేశం జరుగుతుంది. 
 
అలాగే, బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణాలో బీజేపీ ఎంపీలను పవన్ కళ్యాణ్ ఈ విందుకు ఆహ్వానించారు. 
 
మరోవైపు, మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్‌తో సమావేశమయ్యారు. దీనిపై పవన్ స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. బిజీ షెడ్యూల్‌లోనూ తనకు సమయాన్ని కేటాయించినందుకు ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు సాదర స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతికి ధన్యవాదజాలు తెలుపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments