Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే మీ అన్న చిరంజీవి బొక్కబోర్లా పడ్డారు... తెలుసుకో పవన్... కేఈ విమర్శలు

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రచ్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్... ఢిల్లీకి పోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. మూడు నెలలకోసారి వచ్చి

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (22:17 IST)
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రచ్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్... ఢిల్లీకి పోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. మూడు నెలలకోసారి వచ్చి బురద జల్లుడు కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. తమిళనాడులో ఉండే సినీ తరహా రాజకీయాలు ఏపీలో చెల్లవని, ఏపీలో అదే తరహా రాజకీయాలు చేద్దామనుకుని గతంలో చిరంజీవి బొక్కబోర్లా పడ్డారని మంత్రి గుర్తు చేశారు. పోలవరంలో జరిగిన అవినీతేంటో పవన్ చెప్పాలన్నారు. ఆధారాలతో అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే చర్యలు తీసుకునే ధైర్యం మా ప్రభుత్వానికి ఉందన్నారు.
 
సరైన ఆధారాలు లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్  చదువుతూ మా మీద విమర్శలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం, టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ నాశనం అయిందన్నారు. ఏమాత్రమైనా ఇంగితజ్ఞానం ఉంటే పవన్ అలా మాట్లాడి ఉండేవారు కాదు. అధికారంలో లేని రాజకీయ నిరుద్యోగుల దగ్గర సలహాలు తీసుకుంటే పవన్ కళ్యాణే నష్టపోతారన్నారు. 
 
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్రానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే ఢిల్లీ వెళ్లి చేయాలని మంత్రి సూచించారు. నిధులు ఇవ్వడం లేదు కాబట్టే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, రాష్ట్రాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments