Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం లేదు... పుర పోరు నిర్వహించండి.. ఎస్ఈసీకి సీఎస్ లేఖ

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (15:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. పైగా, ఎన్నికలు 6 వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నాద్ధంగా ఉన్నామని ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు ముద్రణ పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రభుత్వంతో ఎస్ఈసీ సంప్రదింపులు జరిపురంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ప్రయాణికుడి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాల కీలక పాత్ర పోషిస్తాయిని తెలిపారు. కరోన నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి వెల్లడించారు. 
 
మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల సీఎస్ నీలం సాహి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments