Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం జగన్ భేటీ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (07:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఈ భేటీ సాయంత్రం 6.30 గంటలకు జరుగనుంది. 
 
నిజానికి వీరిద్దరూ గతంలో పలు కార్యక్రమాల్లో కలుసుకున్నారు. కానీ, ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంపై రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. 
 
ఇటీవలి కాలంలో హైకోర్టులో ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా, పలువురు ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో చిక్కుకుని జైలుశిక్షలు పడే స్థాయికి వ్యవహరిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను కూడా హైకోర్టు కొట్టివేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments