Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి సీఎం జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటన

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, మరికొందరు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశంకానున్నారు.
 
సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో, రాత్రికి హోం మంత్రి అమిత్ షాలతో ఆయన సమావేశమవుతారు. వారిద్దరి అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. 
 
ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానుల ఆవశ్యకత, వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రధానికి, హోం మంత్రికి జగన్ వివరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, విభజన చట్టం ప్రకారం అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను ప్రధానితో చర్చిస్తారని తెలుస్తుంది. 
 
అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని, త్వరలోనే ఏపీలో శ్రీలంక పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం కూడా ప్రధాని మోడీ, సీఎం జగన్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments