Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో సీఎం జగన్ భారీ ఊర‌ట.. పారిస్‌కు జగన్‌కు పర్మిషన్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (14:13 IST)
ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది. పారిస్‌లో చ‌దువుతున్న త‌న కుమార్తె స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది.
 
దీంతో.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నాంప‌ల్లి సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. 
 
జ‌గ‌న్ ఇద్ద‌రు కుమార్తెలు విదేశాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. వారిలో పారిస్‌లో చ‌దువుతున్న కుమార్తె విద్యాభ్యాసం పూర్తి కాగా, క‌ళాశాల స్నాత‌కోత్స‌వానికి రావాలంటూ జ‌గ‌న్‌ను ఆయ‌న కుమార్తె ఆహ్వానించారు.  
 
ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో ప‌ర్య‌టించేందుకు జ‌గ‌న్‌కు కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. అయితే పారిస్ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను సీబీఐ అధికారుల‌తో పాటు కోర్టుకు కూడా స‌మ‌ర్పించాల‌ని జ‌గ‌న్‌ను కోర్టు ఆదేశించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments