Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గ్రాఫ్ బాగుంది : మొత్తం 175 స్థానాలు ఎందుకు గెలవలేం : సీఎం జగన్ ప్రశ్న

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:21 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, "నాదిగాని, నా ప్రభుత్వ పనితీరు సూపర్బ్‌గా ఉంది. కొందరు ఎమ్మెల్యే గ్రాఫ్ కూడా ఫర్వాలేదు. ఇంకొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం ఏమాత్రం బాగోలేదు. వీళ్లకు ఆరు నెలలు, తొమ్మిది నెలలు సమయం ఇస్తున్నా. ఆలోగా వారు ప్రజల్లో పర్యటించి గ్రాఫ్ పెంచుకోవాలని మీరు వివరించండి" అని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు ఆదేశించారు. 
 
ఈ సమయంలో పనితీరును మార్చుకోని, ఓడిపోయే ఎమ్మెల్యేలను పార్టీకి బరువుగా సీఎం జగన్ అభివర్ణించారు. ఓడిపోయే ఎమ్మెల్యేల బరువు మోయలేను. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదన్నారు. అధికారంలోనికి వచ్చాక వారికి ఎమ్మెల్సీలు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తా" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఇపుడున్న 151 స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదని చెబుతూనే. కరోనా కష్టకాలంలోనూ అనేక సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం... మొత్తం 175 స్థానాలు ఎందుకు గెలవలేం" అని ఆయన పార్టీ నేతలను ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments