Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల మృతులపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Webdunia
మంగళవారం, 11 మే 2021 (12:23 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు  సీఎంఓ కార్యాలయ అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ అందించిన వివరాలను ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు. 
 
తనకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించాలని... ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా తక్షణమే అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కేవలం ఆక్సిజన్ సేకరణపైనే కాకుండా, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలపై కూడా దృష్టి సారించాలని అన్నారు.
 
మరోవైపు, కరోనా కష్టకాలంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఎంతో మంది పేషెంట్ల చావుకు కారణమవుతున్న విషయం తెల్సిందే. ఏపీలో ఇది మూడో సంఘటన. తొలుత అంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. ఆ తర్వాత కర్నూలులో జరిగింది. ఇపుడు తిరుపతి రుయా అస్పత్రిలో చోటుచేసుకుంది. 
 
ఇలా ఆక్సిజన్ అందక ప్రతి రోజు దేశ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. అలాంటి విషాదకర ఘటన మరొకటి తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకోవడంతో ఏపీ రాజకీయయ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో... ఆక్సిజన్ సపోర్ట్ పై ఉంటూ చికిత్స పొందుతున్న 11 మంది పేషెంట్లు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments