Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుణ్య ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (10:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ఉద్యోగ నియామకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల వర్తింపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఈ యేడాది జూన్ 30వ తేదీలోపు ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన లేదా అంతకంటే తక్కువగా ఉన్న ఉద్యోగ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. నిజానికి ఈ కారుణ్య మరణాలు గత యేడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ,  దరఖాస్తులు అనేకం ఉండటంతో ఈ ఉద్యోగాల నియామకంలో జాప్యం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments