Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ప్లీజ్.. ప్లీజ్ అని బ్రతిమాలినా ప్రత్యేక హోదా రాదు... పురంధేశ్వరి

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (17:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ భాజపా నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్నిసార్లు ప్లీజ్.. ప్లీజ్ అని అడిగినా ఏపీకి ప్రత్యేక హోదా రానేరాదని తేల్చి చెప్పారు. అది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా వుందని ఆమె పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీ నుంచి భాజపాలోకి వలసలు ఆగవన్నారు. తామేమీ తెదేపా నాయకులను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం లేదని చెప్పిన ఆమె, తెదేపాను భూస్థాపితం చేయాలని తాము అనుకోవడంలేదన్నారు. ఐతే గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ఆమె ఆరోపించారు. 
 
ప్రజావేదిక కూలగొట్టడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెదేపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే... అదే రీతిలో జగన్ ప్రభుత్వం కూడా చేసిందని విమర్శించారు. ఆ కట్టడాన్ని ప్రజల అవసరాలకి ఉపయోగిస్తే బావుండేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments