Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సీనియర్ ఐఎఎస్ పైన దృష్టి పెట్టిన సిఎం... ఎవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (18:56 IST)
ఎపి సిఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసి చర్చకు తెరలేపారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా సిఎం మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారట. అది కూడా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ టిటిడి కార్యనిర్వహణాధికారిని మార్చాలని నిర్ణయానికి వచ్చేశారట. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన ఈయన డిప్యుటేషన్ పైన టిటిడి ఈఓగా వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఐదు నెలల పాటు ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కానీ తిరుమల ప్రత్యేక అధికారి పోస్టును మాత్రం మార్చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పోస్టును కట్టబెట్టారు.
 
ప్రస్తుతం ఈఓ పోస్టును కూడా అదేవిధంగా సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌కు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారట సిఎం. త్వరలోనే దీనికి సంబంధించిన జిఓ కూడా వెలవడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా కీలక పోస్టుల్లో ఉన్న ఐఎఎస్‌లను సిఎం మారుస్తూ వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments