Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రైతులకు పెట్టుబడి సాయం - బటన్ నొక్కనున్న సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులను జమచేయనుంది. తాజా సీజన్ కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మొదటి విడత పెట్టుబడి సాయం కింద ఈ నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రూ.109.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
నిజానికి ఈ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన జరగాల్సివుంది. కానీ, ఆర్థిక శాఖ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ - వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు రైతులకు ఏటా రూ.7500 పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. 
 
ఇది మూడు విడతల్లో అందజేస్తున్న విషయం తెల్సిందే. 2023-24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడత సాయాన్ని నేడు అందించనున్నారు. ఇందుకోసం రూ.109.74 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments