Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారని, దానిని తట్టుకోలేకనే అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిందన్నారు.
 
పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కోసం ఇంకెంతమంది మైనార్టీలను బలిగొంటారని నిలదీశారు. 
 
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ బాషా భూమిని కబ్జా చేస్తే, ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించటం దారుణమని మండిపడ్డారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారన్నారు. బాషా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments