Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా ఆలోచించాం.. పరిపాలనా రాజధానిగా విశాఖ ఎంపిక.. సీఎం జగన్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (12:23 IST)
అంతా ఆలోచించిన తర్వాతే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారంపైన ఆయన తేల్చి చెప్పేసినట్లైంది. 
 
ఇలా చేస్తే సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక అనుకూలత-పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని వివరించారు.
 
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తన అభిప్రాయాలను వివరించారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రులు ఉంటారని.. అక్కడే సచివాలయం ఉంటుందని స్పష్టం చేశారు. 
 
వికేంద్రీకరణ స్పూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. 5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధానిగా మారుతుందని జగన్ వెల్లడించారు.
 
అలాగే తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదన్నారు జగన్. ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని చెప్పారు. 
 
ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి అటు గుంటూరు.. ఇటు విజయవాడకు 40 కిలో మీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments