Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సమాజానికి ఇది గర్వకారణం : జేడీ వాన్స్‌‌కు సీఎం బాబు అభినందనలు

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (11:24 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగాను, ఉపాధ్యక్షుడుగా జేడీ వాన్స్‌లు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్‌కు ఏపీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జేడీ వాన్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలాలు ఉన్న ఉషా వాన్స్, అమెరికా రెండో మహిళగా సేవలందించబోతున్న తెలుగు వారసత్వపు మొదటి మహిళగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఇది గర్వకారణం. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయఢంకా మోగిచిన విషయం తెల్సిందే. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ దేశాధినేతలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.
 
అలాగే యూఎస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు చంద్రబాబు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. ఆయన భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు మెచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments