సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దు : ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (14:56 IST)
ఏపీలోని ఏన్డీయే కూటమి ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ హెచ్చరిక చేశారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రతి ఒక్క సభ్యుడు ఏం మాట్లాడుతున్నారన్న విషయాన్ని  నిశితంగా గమనించాలని ఆయన సూచించారు. 
 
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. పార్లమెంట్‌ రీసెర్చ్‌ స్టడీస్‌ సభ్యులు బడ్జెట్‌పై వారికి అవగాహన కల్పించారు. సదస్సులో భాగంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. రాష్ట్రంతోపాటు కేంద్ర బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని కోరారు. పని చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. 
 
ముఖ్యంగా, 'సభలో ప్రతిపక్షం లేదు కదా.. మనకేముందని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో.. మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక లాంటిది. అసెంబ్లీలో తమ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించరు.. గతంలో ఇదే జరిగిందని హెచ్చరించారు. 
 
బడ్జెట్‌ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రభుత్వం తెచ్చే పాలసీలు, బిల్లులపై శాసనసభ్యులు తప్పకుండా అధ్యయనం చేయాలి. పబ్లిక్‌ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తాం. విజన్‌-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయాలి' అని సీఎం సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments