Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ చీఫ్‌గా కొనసాగుతున్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజును పోలీసులతో కొట్టించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, పలువురు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. 
 
ఇలా, సునీల్ కుమార్‌పై అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పటికీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సీఐడీ విభాగంలో అదనపు డీజీ హోదాను కల్పించింది. ఇపుడు ఆయన్ను బదిలీ చేస్తూ, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. అదేసమయంలో సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. 
 
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేయడం అదికూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఇపుడు రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments