Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు... అవేంటంటే...

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (16:52 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఏకంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఏపీ సచివాలయ మొదటి బ్లాక్‌లో మంత్రివర్గం సమావేశంకాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏపీలో సమగ్ర కులగణనపై ఇందులో చర్చించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. నవంబరు 15వ తేదీ నుంచి ఈ కల గణన చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, ఏపీ మంత్రివర్గం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను పరిశీలిస్తే, 
 
ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్డర్ డ్రాఫ్ట్ 2023కు ఆమోదం.
ఆర్ అండ్ బి డిపార్ట్‌మెంట్‌లో 467 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ.
6790 పాఠశాలల్లో భవిష్యత్ నైపుణ్యాలపై బోధన.
ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మినహాయింపు. 
వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్లకు గ్యారెంటీతో మార్క్ ఫెడ్ ద్వారా రుణం
జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments