Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి వర్గం విస్తరణ: అయిదుగురు ఔట్.. సీమకు పండగే పండగ

ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాబోయే మంత్రులు జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం అర్థరాత్రి ప్రకటించిన తాజా మంత్రుల జాబితాలో రాయలసీమకు అగ్రపీఠం దక్కింది. నాలుగు జిల్లాల నుంచి

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (01:35 IST)
ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాబోయే మంత్రులు జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం అర్థరాత్రి ప్రకటించిన తాజా మంత్రుల జాబితాలో రాయలసీమకు అగ్రపీఠం దక్కింది. నాలుగు జిల్లాల నుంచి మొత్తం ఆరుమందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కేబినెట్‌లోంచి అయిదుగురు మంత్రులను తొలగించగా కొత్తగా 11 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీ ఫిరాయించి మరీ పచ్చకండువా కప్పుకున్న వైకాపా ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రిపదవులు దక్కడం గమనార్హం. కొత్త మంత్రుల జాబితా, తొలగించిన మంత్రుల జాబితాను ఇక్కడ పొందుపరుస్తున్నాం. 
 
కొత్త మంత్రులు వీరే...
1. నారా లోకేశ్‌ (ఎమ్మెల్సీ)
2. కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ)
3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే)
5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే)
6. కొత్తపల్లి జవహర్‌ (ఎమ్మెల్యే)
7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే)
8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే)
9. అమర్‌నాథ్‌రెడ్డి (ఎమ్మెల్యే)
10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే)
11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే)
 
వీరిలో చివరి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నవారు ఫిరాయింపుదారులు
 
ఉద్వాసన వీరికే..
1. కిమిడి మృణాళిని
2. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
3. పీతల సుజాత
4. రావెల కిషోర్‌బాబు
5. పల్లె రఘునాథ్‌రెడ్డి  

కొత్తమంత్రులతో సహా జిల్లాలవారీగా మంత్రుల జాబితా ఇదీ.
శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం: సంజయ్‌ కృష్ణ రంగారావు
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమగోదావరి: కేఎస్‌. జవహర్‌, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం: సిద్ధా రాఘవరావు
నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప: ఆదినారాయణరెడ్డి
కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి
 
ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 20 మంది సభ్యులున్నారు. వాస్తవంగా 26 మందికి అవకాశం ఉంది. 5గురి తొలగింపు, కొత్తగా 11 మంది చేరికతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరనుంది. కొత్త మంత్రులుగా 11 మందితో ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డిలను కేబినెట్‌ నుంచి తొలగించారు.
 
నేడు అంటే ఆదివారం ఉదయం  9.22 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం  చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments