Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రన్న కానుకపై ఆరా : సీబీఐ విచారణకు ఏపీ సర్కారు నిర్ణయం!!

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన చంద్రకానుకపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 
 
గురువారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది. సబ్‌కమిటీ నివేదిక కేబినెట్‌ ముందు ఉంచింది. సబ్‌కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
అదేసమయంలో వైఎస్సార్‌ చేయూత పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు 12వ తేదీన ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 
 
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని దశలవారీగా చేపట్టాలని తీర్మానం చేశారు. రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్‌కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ నిధులు ఖర్చు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments