Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నరును కలువనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (14:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్వరలోనే ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన తనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలని కోరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, ఎస్ఈసీ నుంచి నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి పునర్నియమించాలని సూచన చేసింది. కానీ, ఏపీ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అక్కడ కూడా ఏపీ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దంటూ హితవు పలికింది. 
 
ఈ నేపథ్యంలో గవర్నర్ హరిచందన్‌తో సమావేశం కావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. పైగా, ఈ సందర్భంగా ఆయన తనను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నియమించాలని కోరనున్నట్టు సమాచారం. ఎందుకంటే. రాజ్యాంగబద్ధమైన నియామకాలను గవర్నరు చేపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments