Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ జగన్... ఏంటిది.. మీరేం చేస్తున్నారు.. : బీజేపీ నేత దేవధర్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (08:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. ఈ ఘటనలపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలను రక్షించలేరా..? దేవదాయ మంత్రితో రాజీనామా ఎందుకు చేయించరు అంటూ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ నిలదీశారు. 
 
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలను ఆక్షేపించారు. ఈ దాడులపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం రావణుడి పాలన సాగుతోందని దుయ్యబట్టారు. 'రామతీర్థంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండరాముడి విగ్రహ శిరస్సు తొలగించారు.. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్ర కలిగిన సీతా మాత విగ్రహాన్ని విజయవాడలో హిందూ వ్యతిరేకులు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. 
 
మిస్టర్.. జగన్మోహన్‌ రెడ్డీ..! మీరేం చేస్తున్నారు..? మీ మౌనంతో దేశానికి ఏం సందేశమిస్తున్నారు..? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడం మీకు చేతకాదా..? మీ ప్రభుత్వం మతమార్పిడులను ఎందుకు ప్రోత్సహిస్తోంది.? మీ ఉపముఖ్యమంత్రి తిరుమల ప్రాంగణంలో క్రిస్మస్‌ శుభాకాంక్షలు ఎలా చెబుతారు..? అదేరోజు చర్చిల వద్ద నిల్చొని మీ మంత్రులు ఎందుకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పలేదు' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments