Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (09:16 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అయితే, వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పీఏ ఘటనాస్థనంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా, విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments