Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (09:16 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అయితే, వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పీఏ ఘటనాస్థనంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా, విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments