Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షా కాల స‌మావేశాలు....5 రోజులే!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:48 IST)
ఈనెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే. ఈ నెలలో ఐదు రోజులు, డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
 
దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ల ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అధికార వైకాపా అంచనా వేస్తోంది. అలా సాధించి సంపూర్ణ మెజారిటీతో శాసన మండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments