Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో రాజధానిపై రగడ : 9 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (17:59 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పెద్ద రగడ జరిగింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిపార్సు మేరకు... స్పీకర్ తమ్మినేని సీతారాం తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 
 
అమరావతి రాజధాని భూముల పేరు క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెదేపా పాల్పడిందంటూ వైకాపా సభ్యులు ఆరోపించారు. దీనికి తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ ఎంతలా నచ్చజెప్పినా వారు శాంతించలేదు. 
 
దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న తెదేపా సభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌లను మంగళవారం ఒక్కరోజు మాత్రం సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments