Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు - మొత్తం 225, ఏంటా లెక్క?

తెలంగాణాలో ఇప్పటికే అసెంబ్లీ స్థానాలను పెంచేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ స్థానాలు పెరిగికొద్దీ అభివృద్థి జరుగుతుందని వారి భావన. నియోజవర్గం పెద్దదిగా ఉంటే అభివృద్థి చేయలేమన్నది అందరికీ తెలిసిందే. దీన్నే పరిగణలోకి తీసుకున్న కెసిఆర్ ఒక్కసారిగా తెల

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:39 IST)
తెలంగాణాలో ఇప్పటికే అసెంబ్లీ స్థానాలను పెంచేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ స్థానాలు పెరిగికొద్దీ అభివృద్థి జరుగుతుందని వారి భావన. నియోజవర్గం పెద్దదిగా ఉంటే అభివృద్థి చేయలేమన్నది అందరికీ తెలిసిందే. దీన్నే పరిగణలోకి తీసుకున్న కెసిఆర్ ఒక్కసారిగా తెలంగాణాలో అసెంబ్లీ స్థానాలను పెంచేశారు. ఇక ఆ బాటలోనే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుస్తున్నారు. ఎపిలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిని మరో 50 పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఏయే జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయో చూద్దామా.. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాల వివరాలు ఇవి..
 
అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో అసెంబ్లీ స్థానం పెరగనుంది. 
చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కడప జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 19 అసెంబ్లీ స్థానాలకు మరో 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న 17 అసెంబ్లీ స్థానాలకు మరో 5 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న 16 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
కర్నూల్ జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న 12 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ స్థానాలకు మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. 
విజయనగరంజిల్లాలో ఇప్పుడున్న 9 అసెంబ్లీ స్థానాలకు మరో 2 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
విశాఖపట్టణంజిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ స్థానాలకు మరో 5 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
 
అసెంబ్లీ స్థానాలు పెరగడం ముఖ్యం కాదు కానీ అభివృద్థి జరగడం ముఖ్యమంటున్నారు ప్రజలు. మరి అసెంబ్లీ నియోజవర్గాలను పెంచిన తరువాత ఏమాత్రం అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments