Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కాగా, ఏపీకి కొత్త గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అబ్దుల్ నజీర్ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేయనున్నారు. ఆయన పాల్గొనే తొలి అధికారిక కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ ఉభయసభలు వాయిదాపడతాయి. ఆ తర్వా శానససభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై సభ నిర్వహణపై ఒక షెడ్యూల్‌ను ఖరారు చేస్తుంది. ఈ బీఏసీ సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతుంది. 
 
ఇందులో అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. మరోవైపు ఈనెల 24వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments