Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి పేరు మార్చింది. గత వైకాపా ప్రభుత్వం అమలు చేసిన "శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకం"  పేరును ఏపీ సరీ సర్వే ప్రాజెక్టుగా మార్చు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలకు తనతో పాటు తన తండ్రి పేర్లను పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇపుడు వీటి పేర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మార్చివేస్తుంది. 
 
తాజాగా పేరు మార్చిన ఏపీ రీ సర్వే ప్రాజెక్టు పథకంలో భాగంగా, గ్రామాల్లో భూ వివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంంత తీసుకొచ్చామని గత ప్రభుత్వం పేర్కొంది. ఇందులోభాగంగా, భూములను సమగ్ర రీ సర్వే చేపట్టారు. కానీ, ఈ పథకం ఆచరణలో వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు తీరును అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇపుడు  ఆయన సీఎం కావడంతో ఈ పథకంలో మార్పులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments