మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి పేరు మార్చింది. గత వైకాపా ప్రభుత్వం అమలు చేసిన "శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకం"  పేరును ఏపీ సరీ సర్వే ప్రాజెక్టుగా మార్చు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలకు తనతో పాటు తన తండ్రి పేర్లను పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇపుడు వీటి పేర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మార్చివేస్తుంది. 
 
తాజాగా పేరు మార్చిన ఏపీ రీ సర్వే ప్రాజెక్టు పథకంలో భాగంగా, గ్రామాల్లో భూ వివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంంత తీసుకొచ్చామని గత ప్రభుత్వం పేర్కొంది. ఇందులోభాగంగా, భూములను సమగ్ర రీ సర్వే చేపట్టారు. కానీ, ఈ పథకం ఆచరణలో వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు తీరును అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇపుడు  ఆయన సీఎం కావడంతో ఈ పథకంలో మార్పులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

Pavala Shyamala: క్షీణిస్తున్న సీనియర్ న‌టి పావలా శ్యామల ఆరోగ్యం - కూతురికి అనారోగ్యం

Ram Gopal Varma: రాజమహేంద్రవరంలో రామ్ గోపాల్ వర్మపై కేసు

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments