Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మరో యూటర్న్ : శాసనమండలి రద్దు నిర్ణయ వెనక్కి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 
 
గతంలో శాసనమండలి రద్దు తీర్మానానికి 132 మంది వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరుకాక పోవడంతో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆ రోజున శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 
 
అయితే, ఈ తీర్మానాన్ని ఉపసహంరించుకుంటూ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, మరోమారు సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments