Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మరో యూటర్న్ : శాసనమండలి రద్దు నిర్ణయ వెనక్కి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 
 
గతంలో శాసనమండలి రద్దు తీర్మానానికి 132 మంది వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరుకాక పోవడంతో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆ రోజున శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 
 
అయితే, ఈ తీర్మానాన్ని ఉపసహంరించుకుంటూ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, మరోమారు సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments