మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ.. మండిపడిన లోకేశ్...

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (22:00 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. గత ఏపీ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబును ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును ఏ3గా పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 
 
కాగా, చంద్రబాబును ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు రాజమండ్రి జైలులో బంధించారు. అలాగే, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇపుడు తాజాగా మద్యం అనుమతుల కేసును నమోదు చేసింది. దీనికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 
 
తన తండ్రి చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డో, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments