Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 16 మంది ఐపీఎస్‌లకు షాక్... మెమోలు జారీ చేసిన ఏపీ డీజీపీ!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (14:40 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా మంత్రులు, అధికార నేతల ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఐపీఎస్ అధికారులు ఎదురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ప్రస్తుతం వెయిటింగ్‌ జాబితాలో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు.
 
వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేనివారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్‌, కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్ని, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. 
 
ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ప్రధాన కార్యాలయంలో రిపోటు చేయాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, పైన పేర్కొన్న అధికారులు వైకాపా ప్రభుత్వంలో ఇష్టాను రీతిలో అఖిల భారత సర్వీసులకు విరుద్ధంగా నడుచుకుని ఇపుడు సమస్యలను ఎదుర్కొంంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments