Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం... నేడు కూడా మరికొన్ని రైళ్లు రద్దు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:26 IST)
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అక్టోబరు 31వ తేదీ మంగళవారం కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వీటిలో ప్రధాన రైళ్లుగా భావించే హౌరా - సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా - బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - హైదరాబాద్‌(18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 
 
అలాగే, తిరుపతి - పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస - విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి - విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ - గుణుపూర్‌(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments