Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (11:40 IST)
సింహాచలం ఆలయంలో చందనోత్సవ వేడుకల సందర్భంగా గోడకూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ సారథ్యంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
తాత్కాలిక గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించేందకు ఇంజనీరింగ్ అధికారి ఎవరూ లేకపోవడంతో ఆమోదం కూడా లేకపోవడంతో పునాదులు లేకుండానే కాంట్రాక్టర్ గోడ నిర్మించాడు. పైగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రధానగా మొదటి నుంచి ఇప్పటివరకూ చేసిన ఓ ఒక్క పనికీ సరైన అనుమతులు లేవని విచారణలో వెల్లడైంది. 
 
తాత్కాలిక గోడ నిర్మాణం ఎందుకు చేపట్టారు. ఎవరు అనుమతిచ్చారు. ఎవరు పర్యవేక్షించారు అనే విషయాలకు స్పష్టమైన సమాధానం అధికారులు విచారణ కమిటీ ముందు చెప్పలేక పోయారు. అంతేకాకుండా మూడు అంతస్తులు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలోనూ ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు ప్రారంభించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ గోడకూలిన ఘటనలో పర్యాటక శాఖ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్ ఈ దుర్ఘటనకు బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలింది. కింది నుంచి పైకి వరకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహించినట్టు విచారణ కమిటీ నిర్ధారించింది. తప్పను ఒకరిపై మరొకరు తోసుకుంటా బాధ్యతల లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నట్టు కమిటీ గుర్తించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments