మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : టీడీపీ - జనసేన డిమాండ్

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (14:33 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టంలోని హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే. అదేసమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఆ పార్టీ కేవలం 240 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఆ కూటమి నేతగా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. దీంతో ఆయన మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్తగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యంకానుంది. దీంతో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే రెండు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని కోరినట్టు ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా ఈ కూటమిలో మరో కీలక పార్టీ అయిన బీహార్‌కు చెందిన జేడీయు కూడా కీలక మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తుంది. వీటిలో రైల్వే, వ్యవసాయ మంత్రిత్వ శాఖలను కోరుతుందని, భారతీయ జనతా పార్టీ మాత్రం ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు అంశం ఇపుడు అమితాసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments