Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ప్రేమోన్మాదం.. ప్రేయసిని గన్‌తో షూట్ చేశాడు.. తాను కూడా..?

Webdunia
సోమవారం, 9 మే 2022 (19:05 IST)
నెల్లూరులో ప్రేమోన్మాదం బయటపడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ప్రియురాలిని యువకుడు గన్‌తో కాల్చాడు. అనంతరం ప్రేమికుడు కూడా తనను కాల్చుకుని చనిపోయాడు. యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో బెంగళూరులో పనిచేసేవారు.. కానీ వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో ఊర్లోనే ఉంటున్నారు. 
 
సురేష్, కావ్యలు తమ ప్రేమ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారట. సురేష్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.  సోమవారం కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు.
 
ఒప్పుకోకపోతే తుపాకీతో బెదిరించైనా ఒప్పించాలనే.. తన వెంట తుపాకీ కూడా తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆవేశంతో ఆ తర్వాత కావ్యపై కాల్పులు జరిపాడు. 
 
ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందడంతో.. విషాదంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments