Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెండర్లు లేకుండానే రూ.కోట్లు "బూడిద గంతల్లో" పోస్తారా?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్లాంట్‌లో బూడిదగుంత (యాష్‌ పాండ్‌) నిర్మాణానికి టెండర్లతో సంబంధం లేకుండా రూ.56.50 కోట్ల కాంట్రాక్టును ఎలా అప్పగించారని నిలదీసింది. 
 
టెండర్లు ఆహ్వానించకుండా నామినేషన్‌ ఆధారంగా కాంట్రాక్టు కట్టబెట్టడానికి వీల్లేదన్నారు. బాధ్యులైన అధికారులపై ప్రాథమికంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టాలని, వచ్చేజనవరి 25లోపు నివేదిక సమర్పించాలని లోకాయుక్తను ఆదేశిస్తూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
నెల్లూరు జిల్లా నేలటూరులోని ఈ పవర్‌ప్లాంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండో బూడిదగుంత నిర్మిస్తున్నారని, దీనిని నిలువరించాలని డి.రామసుబ్బారెడ్డి తదితరులు 2018 ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. విచారణను వారం వాయిదా వేయాలని పవర్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ తరపు న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి అభ్యర్థించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments