తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (11:01 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణాలో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఈ తీవ్రత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువగా నమోదవుతున్నాయి. 
 
సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల వడగాల్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. 
 
రానున్న రోజుల్లో ఏపీలోని విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 153 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments