Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 7 మే 2023 (15:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను పసిగట్టిన ప్రజలు భయంతో తమ ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు ముందు భారీ శబ్దం వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. 
 
ఆదివారం ఉదయం జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వారు వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
కాగా, ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చి నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు గృహాల గోడలకు బీటలు వారాయి. వీధుల్లో వేసిన సిమెంట్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో తరచుగా ఈ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments