Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు జమ

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2800 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్మును 49,43,590 రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి యేడాది రూ.13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. ఇందులోభాగంగా, తొలివిడతలో గత నెలలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.875 కోట్లను జమ చేశారు.
 
ఇపుడు మరో రూ.5500 చొప్పున ప్రతి రైతుకు జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ.7500 జమ చేసినట్టు అవుతుంది.
 
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నగదు జమ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments