Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు జమ

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2800 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్మును 49,43,590 రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి యేడాది రూ.13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. ఇందులోభాగంగా, తొలివిడతలో గత నెలలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.875 కోట్లను జమ చేశారు.
 
ఇపుడు మరో రూ.5500 చొప్పున ప్రతి రైతుకు జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ.7500 జమ చేసినట్టు అవుతుంది.
 
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నగదు జమ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments