Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి ఇకపై వారికి నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టంచేసింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీచేశారు. 
 
ఈ కార్యాలయాల్లో అవినీతి పెరగడగానికి ప్రధాన కారణం అనధికార వ్యక్తులేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. 
 
ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, అందుకే అనధికార వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments