Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సచివాలయాలు : జీవో నంబరు 2ను సస్పెడ్ చేసిన హైకోర్టు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (14:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో దెబ్బలపై దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో కోర్టులతో అక్షింతలు వేయించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు తాజాగా మరోమారు కోర్టులో చుక్కెదురైంది. 
 
ఏపీలో అధికార మార్పిడి చోటుచేసుకుంది. దీంతో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పనిలోపనిగా గ్రామ పంచాయతీల అధికారాలను గ్రామ సచివాలయాలకు బదలాయిస్తూ గతంలో ఏపీ సర్కారు నిర్ణయించడం విమర్శలపాలైంది. 
 
సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓల అధికారాలు బదిలీ అంశంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ని సస్పెండ్ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 
గతంలోనూ హైకోర్టు ఈ అంశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఉండగా, సచివాలయాల పేరుతో మరొక వ్యవస్థ ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్థల అవసరమేంటని నిలదీసింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇపుడు కోర్టు అక్షింతలతో పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments