Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ 'స్థానిక' పంచాయతీ : తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (13:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణ ఇపుడు సాధ్యంకాదని హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈసీ జారీచేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది.
 
కానీ, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. 
 
అలాగే, కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించారు. 
 
ఏజీ వాదనలకు ఎస్ఈసీ తరపు న్యాయవాది బదులిచ్చేందుకు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అదేసమయంలో ఇక ఉద్యోగుల తరపున దాఖలైన అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments