Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ : నిరసనకు దిగిన అడ్వకేట్లు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (14:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. దీంతో ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తూ వచ్చిన బట్టు దేవానంద్, డి.రమేష్‌లు బదిలీ అయ్యారు. వీరిలో బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టు బదిలీ కాదా, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. 
 
అయితే, న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను కొలీజియం బదిలీ చేస్తూ గురువారం సిఫార్సు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఇద్దరేసి, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. 
 
జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సిఫార్సు చేసింది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments