Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట.. ఎలా?

Mohan Babu
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబానికి ఊరట లభించింది. గత 2019 ఎన్నికలకు ముందు ధర్నాకు దిగి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో ఆయన ఊరట లభించింది. ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు 8 వారాల పాటు విచారణను వాయిదా వేసింది. 
 
గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపిస్తూ తన ఇద్దరు కుమారులతో కలిసి మోహన్ బాబు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసుల కేసు నమోదైంది. 
 
ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగురుతున్న విమానంలో రచ్చ.. కిటికీలను కాళ్లతో తన్నాడు..