Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (15:09 IST)
గత 2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మెయిన్స్ పేపర్‌ను రెండు సార్లు మూల్యాంకనం చేయించుకుంటూ పిటిషన్ దాఖలైంది. పైగా నచ్చిన వారిని ఎంపిక చేసి ఫలితాలను ప్రకటించారని ఆరోపించారు. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెయిన్స్ జవాబు పత్రాలను చేతిలో దిద్దే (మాన్యువల్) విధానం ద్వారా రెండుసార్లు మూల్యాంకనం చేశారని, కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను పక్కన పెట్టి, రెండోసారి మళ్లీ మూల్యాంకన చేయించి వచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 
 
మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశించింది. మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని, ఆరు వారాల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై గ్రూపు-1 ద్వారా ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments