Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడుతుంది...

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:19 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రుల వద్ద స్వామిభక్తిని ప్రదర్శించిన జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటుపడుతుంది. వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. 
 
రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ఏ మాత్రం ప్రాధాన్యత లేని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది. సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించారనే ఫిర్యాదులున్న ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌కి అస్సలు పోస్టింగే ఇవ్వలేదు. 
 
సునీల్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా వ్యవహరించిన చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకుల దాష్టీకాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రస్తుత కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ రిషాంత్‌ రెడ్డికీ ఏ పోస్టింగూ ఇవ్వలేదు. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగన్ భక్త ఐపీఎస్ అధికారులతో పాటు.. ఐఏఎస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments