Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడుతుంది...

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:19 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రుల వద్ద స్వామిభక్తిని ప్రదర్శించిన జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటుపడుతుంది. వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. 
 
రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ఏ మాత్రం ప్రాధాన్యత లేని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది. సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించారనే ఫిర్యాదులున్న ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌కి అస్సలు పోస్టింగే ఇవ్వలేదు. 
 
సునీల్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా వ్యవహరించిన చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకుల దాష్టీకాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రస్తుత కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ రిషాంత్‌ రెడ్డికీ ఏ పోస్టింగూ ఇవ్వలేదు. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగన్ భక్త ఐపీఎస్ అధికారులతో పాటు.. ఐఏఎస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments