Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పీఆర్సీ ఆమలుకు జీవో జారీచేసిన ఏపీ సర్కారు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (14:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీని అమలు చేసేలా ఆదివారం కొత్త జీవోను జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీ అమలును ప్రభుత్వం ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త పీఆర్సీను చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో వచ్చే నెల కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించనున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త పీఆర్సీని ప్రకటించింది. అయితే, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేంత వరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. పైగా, ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ట్రెజరీ డైరెక్టర్, ట్రెజరీ అధికారులు పీఆర్సీ అమలుపై దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోపు వేతన బిల్లులు రూపొందించి సీఎఫ్ఎంఎస్‌కు పంపాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతి రోజూ పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నివేదిక అందించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments